పక్షి ప్రేమికులకి, పక్షుల మీద పరిశోధనలు చేసేవారికి మరియు పర్యాటకులని ఆకట్టుకునే ప్రదేశం మంగళ వనం బర్డ్ సాంచురి. ఈ బర్డ్ సాంచురి ఎర్నాకుళం లో ఉన్న హై కోర్ట్ భవనం పక్కనే ఉంది. వివిధ రకాల పక్షులు మనకి ఈ సాంచురి లో తారసపడతాయి.
అరుదైన వలస వచ్చిన పక్షులు మరియు స్థానిక పక్షులను మనం ఇక్కడ గమనించవచ్చు. వివిధ రకాల అరుదైన పక్షుల వల్లే కాకుండా ఈ సాంచురి లో ఉన్న ఎన్నో రకాల ప్రత్యేకమైన మొక్కలు మరియు జంతువుల వల్ల కూడా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. కొచ్చి లో ని బ్యాక్ వాటర్స్ కి ఈ ప్రాంతం ఒక ఫీడర్ కెనాల్ ద్వారా అనుసంధానమై ఉంది.
అరుదైన చెట్లు, పక్షుల పెంపకం కలిగి ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని సంరక్షించవలసిన ప్రాంతంగా 2004 లో ప్రకటించారు. ఎప్పుడూ తడిగా పట్టులా ఉండే ఆకుపచ్చని నేల, అరుదైన జాతి పక్షులు మరియు చెట్ల వల్ల, ఎర్నాకుళం యొక్క ఆకుపచ్చని శ్వాసకోస గా ఈ ప్రాంతాన్ని పరిగణించవచ్చు. అరుదైన వలస పక్షులని చూడడానికి జనవరి నుండి మార్చ్ ప్రారంభం వరకు ఈ సాంచురి ని సందర్శించేందుకు అనువైన సమయం.