కేరళలో నున్న మొట్ట మొదటి కాథలిక్ చర్చులలో సెయింట్ జార్జ్ చర్చ్ ప్రధానమైనది. దీనిని స్థానికులు ఎదపల్లీ పల్లీ గా పిలుస్తారు. ఈ చర్చి ఎదపల్లి లో ఉంది. ఈ గ్రామం కొచ్చి నుండి 10 కి మీ ల దూరం లో ఉంది. 6 వ శతాబ్దంలో 594 A D లో ఎదపల్లి రాజు చే కానుకగా ఇవ్వబడిన స్థలం పై ఈ చర్చ్ నిర్మించబడినదని భావించవచ్చు. కట్టినప్పటి నుండి ఎన్నో రకాల మరమ్మత్తులకి ఈ చర్చ్ గురైయింది.
ఈ చర్చ్ నిర్మాణంలో ఉన్నప్పుడు కన్నె మేరీ కి అంకితమివ్వబడినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత, సెయింట్ జార్జ్ పేరుని ఇంగ్లాండ్ లో ని పాట్రన్ సెయింట్ గా ప్రకటించినప్పుడు ఈ చర్చ్ ఆ పేరుతోనే ప్రాచుర్యం పొందింది. గుర్రం మీద కుర్చుని డ్రాగన్ తల నరుకుతున్నట్టుగా ఉండే సెయింట్ జార్జ్ విగ్రహం, కన్నె మేరీ మరియు స్వర్గ లోకపు దేవకన్యల చిత్రాలతో ఉన్న గోడలు ఈ చర్చ్ ప్రత్యేకతలు.
ఏప్రిల్ మరియు మే నెలల్లో జరిగే పెద్ద పండుగలో భాగంగా ఈ చర్చి లో ఉత్సవాలు మరియు ఊరేగింపులు జరుగుతాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలలో పాల్గొనడానికి ఏంతో మంది భక్తులు మరియు పర్యాటకులు సెయింట్ జార్జ్ చర్చ్ కి తరలి వస్తారు.