కేరళలో ఉన్న అతి పురాతన చర్చులలో సెయింట్ మేరీ కేథడ్రల్ బసిలికా ఒకటి. 112 AD లో ఈ చర్చ్ ని కట్టారు. అయితే 20 వ శతాబ్దంలో మార్ లూయిస్ పజ్హేపరంబిల్ మార్గదర్శకత్వం తో ఈ చర్చ్ ని పునర్నిర్మించారు. 1974 మార్చ్ 20 న ఈ కేథడ్రాల్ కి బసిలికా హోదాని పోప్ పాల్ VI కల్పించారు. మేరీ భక్తులు ఎందరికో ఈ ప్రాంతం గొప్పదైన ఆధ్యాత్మిక ప్రాంతం.
రోమన్ బసిలికా శైలి లో ఈ కేథడ్రల్ ని నిర్మించారు. తరతరాల నిర్మాణకళ చరిత్రలో ఇది ఒక అద్భుతం. చర్చ్ ని సందర్శించడానికి వచ్చిన వారు, కొవ్వొత్తులు వెలిగించడానికి అనుమతి ఉంది. ఎర్నాకుళం కి సమీపంలో ఉండడం వల్ల ఈ చర్చి కి రోడ్డు మార్గం ద్వారా సులభం గా చేరుకొనవచ్చును.