కురింజి అండవర్ ఆలయం బస్ స్టాండ్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్పించే ఈ అరుదైన కురింజి పూలు, ఈ ప్రాంతంలో ప్రసిద్ది చెందినవి. ఈ ప్రాంతంలో ఆలయంలో శ్రీ కురింజి ఈశ్వరన్ అని పిలవబడే మురుగన్ ఉంటాడు. ఈ ఆలయం 1936 లో నిర్మించబడింది. హిందూ ధర్మాన్ని స్వీకరించిన ఒక యూరోపియన్ అమ్మాయి ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ అమ్మాయి హిందువుల అబ్బాయిని పెళ్లి చేసుకుంది, ఈ అమ్మాయిని లేడీ రామనాథన్ అంటారు. ఈ ఆలయం ఇపుడు అరుల్మిఘు దండయుతపాణి స్వామి తిరు కోవిల్ క్రింద ఉంది.