ఈ రాతి స్తంభాలు బస్ స్టాండ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇవి కొడైకెనాల్ లోని అత్యంత ప్రసిద్ది పర్యాటక స్థలాలో ఒకటి. నిలువుగా నిలబడి ఉండే మూడు గ్రానైట్ బండరాళ్ళ వల్ల ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఈ స్తంభాలు 400 అడుగుల ఎత్తులో ఉంటాయి, ఈ ప్రాంతం చుట్టూ ప్రకృతి అందాలు విహంగ వీక్షణంగా ఉంటాయి. రెండు దార్ల మధ్య రాళ్లు లోతుగా, ప్రమాదకరంగా ఉండడం వల్ల దీనిని డెవిల్స్ కిచెన్ అంటారు. ఈ ప్రదేశం చాలా సుందరమైన దృశ్యాలను అందిస్తుంది. ఈ రాతి స్తంభాలను తమిళనాడు అటవీ శాఖవారు నిర్వహిస్తున్నారు.