కీళ్ తలి మహాదేవ ఆలయం కొడంగలూర్ లో బాగా రద్దీ గా ఉండే మతపరమైన ప్రదేశాలలో ఒకటి. త్రిస్సూర్ జిల్లాలో గల ఈ గుడి, శతాబ్దాల చరిత కలది. ఆకర్షణీయమైన నిర్మాణ సౌందర్యం గల ఈ ఆలయం పురాతనమైనది. మహాదేవ అని పిలవబడే పరమశివుడు ఇక్కడ పూజలందుకుంటాడు. కేరళ లో నలు మూలల నించి ప్రజలు మహదేవుని దర్శనార్ధం కీళ్ తలి ఆలయం చేరుకుంటారు.గర్భగుడి లో ప్రతిష్టించబడిన భారీ శివలింగం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ శివలింగం వందల ఏళ్ళ నాటిదని విశ్వాసం. 8 అడుగులు ఎత్తు, 7.5 అడుగుల వ్యాసార్థం కలిగి భారతదేశం లోనే అతి పెద్ద శివలింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సూర్యాస్తమయ సమయంలో దేదీప్యమానంగా వెలిగిపోయే ఆలయం ఒక మనోజ్ఞ దృశ్యం. కొండ పై వెలసిన ఈ దేవాలయం, యాత్రికులకు అలౌకికమైన అందాలని పరచినట్టు చూపిస్తుంది.