కోలార్ జిల్లా సందర్శించే పర్యాటకులు రామలింగేశ్వర దేవాలయాల సముదాయానికి ప్రసిద్ది చెందిన ఈ అవని గ్రామం సందర్శించాల్సిందే. దక్షిణ గయగా పిలువబడే అవని గ్రామం కోలార్ బంగారు గనులకు 10 మైళ్ళ దూరంలో ఉంది. ఈ గ్రామంలో సీతాదేవి ఆలయం ఉంది, సీతా దేవి కోసం నిర్మితమైన అరుదైన ఆలయాల్లో ఇది ఒకటి.
పురాణాల ప్రకారం, సీతాదేవి లవకుశులకు ఇక్కడే జన్మనిచ్చింది, రాముడికి ఆయన కుమారులకు మధ్య ఈ గ్రామంలోనే యుద్ధం జరిగింది. పర్యాటకులు లవకుశులు పుట్టిన గది (వాల్మీకి ఆశ్రమం) ని ఇక్కడ చూడవచ్చు. వాల్మీకి (రామాయణ రచయిత) ఒకప్పుడు ఇక్కడ నివసించారని స్థానికుల నమ్మకం.
ప్రయాణీకులు అవనిని సందర్శించిన తరువాత అవని శ్రింగేరి జగద్గురు శంకరాచార్య శారద పీఠాన్ని కూడా అక్కడ చూడవచ్చు. అవని లో నివసిస్తున్నపుడు శ్రీ నరసింహ భారతి IV శారద మాత విగ్రహాన్ని కనుగొన్న తరువాత ఈ మఠం స్థాపించబడింది. మఠం లో ఈ విగ్రహం నిలబడినట్లుగా ఉంటుంది, దీని చెరో పక్క శ్రీచక్రం, శ్రిమజ్జగద్గురు శంకరాచార్యుల వారి విగ్రహాలు ఉంటాయి. అవనిని సందర్శించే పర్యాటకులు ట్రెక్కింగ్, పర్వతారోహణ వంటివి కూడా చేయవచ్చు