కోలార్ జిల్లాను సందర్శించే యాత్రికులు పార్వతి దేవి కోసం కట్టిన కోలారమ్మ గుడిని తప్పక చూడాలి. ‘ఎల్’ ఆకారంలో వుండే ఈ తీర్థ స్థలం ద్రావిడ విమాన నిర్మాణ శైలి లో కట్టారు. ఇది సుమారు 1000 సంవత్సరాల క్రితం చోళులు నిర్మించింది. కోలారమ్మ దేవి ఆశీస్సుల కోసం మైసూరు ను ఏలిన రాజులు ఈ తీర్థాన్ని సందర్శించేవారు.
ఈ గుడికి చేరుకున్నాక, గ్రానైట్ రాళ్ళతో చెక్కిన నమూనాలు, విగ్రహాలు యాత్రికులను అబ్బుర పరుస్తాయి. తేలు దేవత చేలమ్మ కూడా కోలారమ్మ దేవాలయంలో వుంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం చేలమ్మ దేవతకు పూజలు చేస్తే తేలు కాటు నుంచి రక్షణ లభిస్తుంది. (కన్నడంలో) హుండీ లేదా బావి కూడా ఈ తీర్థ స్థలి లో భాగం – దీంట్లో భక్తుల కానుకలన్నీ వేస్తారు. ఇక్కడి ఆచారం ప్రకారం, భక్తులు నేల మీద వున్న రంధ్రాలలో ఒక నాణెం ఉంచాలి.