కోలార్ మీదుగా పర్యటిస్తున్న యాత్రీకులు అందరూ ఇక్కడ ఉన్న విదురాశ్వత్థ దేవాలయాన్ని చూడడానికి అనుమతించబడింది. ఈ స్థలం గౌరీబిదనూర్ తాలూకా నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది, దీనికి దేశంలోని అతి ముఖ్యమైన ఆలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ప్రయాణీకులు ఈ విగ్రహాన్ని చేరిన తరువాత, ప్రఖ్యాత ముని మైత్రేయునిచే ద్వాపర యుగంలో నాటబడిన పవిత్ర అశోక చెట్టుని ఇక్కడ చూడవచ్చు. కృష్ణ భగవానుడి గొప్ప అనుచరుడు అయిన విదురుడి ఈ గుడిలో పూజలు చేయడం వల్ల దీనికి విదురాశ్వత్థ అనే పేరు వచ్చింది.
అశోక చెట్టు మానవ జీవిత వృక్షానికి సంబంధించిన నాలుగు ప్రత్యెక శాఖలని కలిగి ఉంది. ఈ చెట్టులోని కొన్ని మూలకాలను మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. 1938 లో ఇక్కడ జరిగిన సత్యాగ్రహ ఉద్యమం లాంటి చారిత్రిక సన్ఘతనలత౦ ఈ స్థలం అనుసంధానించబడి వుంది. పౌరాణిక, చారిత్రక సంఘటనల ఆధారంగా ప్రజలకు సంబంధించిన ధర్మ, కర్మ, దేశభక్తికి సంబందించిన సమాగమ స్థానంగా ఈ విదురాశ్వత్థ పేరుగాంచింది.
ఈ విగ్రహాన్ని ప్రతి సంవత్సరం వేలమంది భక్తులు రథోత్సవం (బ్రహ్మోత్సవం) సమయంలో సందర్శిస్తారు. ఈ పండుగ చైత్రమాసం లో వచ్చే పౌర్ణమి రోజు నిర్వహించబడుతుంది. అనేక వివాహ వేడుకలు ఈ దేవత సమక్షంలో జరుగుతాయి. ఈ గుడి వెనుక వున్న సత్యాగ్రహ స్మారకాన్ని కూడా పర్యాటకులు చూడవచ్చు.