ఛత్రపతి శాహూ మహారాజ్ నేపధ్యానికి నేరుగా సంబంధం వున్న భవానీ మండపం కొల్హాపూర్ లోని అందమైన భాగం. కొల్హాపూర్ నిర్మాణంగా భావించే ఈ పురాతన కట్టడం ఈ నగర వైభవంగా పిలువబడుతుంది.కొల్హాపూర్ స్వయం ప్రతిపత్తి సాధించిన సందర్భంలో అప్పటి రాజు రెండో శివాజీ దీన్ని నిర్మించాడు. ఈ మండపం భవానీ దేవత కోసం నిర్మించారు. 14 చదరాలతో మొదట్లో నిర్మించిన ఈ మండపం లో ముస్లిం దండయాత్రల వల్ల ఏడు శిధిలమైపోయాయి.ఈ మండపం లోని ఆవరణం చాలా పెద్దది, గంభీరమైనది. ముఖద్వారం లో శాహూ మహారాజ్ విగ్రహాన్ని, ప్రాసాదం అంతటా సూక్ష్మంగా చెక్కిన దీపాలు, ఆభరణాలు అలంకరించి వుండడం చూడవచ్చు.