కొల్లాం కి 25 కి.మి. దూరం లో ఉన్న ఈ చిన్న పట్టణం గుళ్ళకి, మతపరమైన ప్రాంతాలకీ ప్రసిద్ది. వేదాలపరంగా చూస్తే ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ద సన్యాసులది. అంతే గాక ప్రాచీన కాలం లో ఇక్కడ ఒక అధ్యయన కేంద్రం కూడా ఉండేది. ఈ పరిసరాల్లో బయటపడ్డ బుద్ద విగ్రహం కూడా దీన్నే నిర్ధారిస్తోంది. ఇక్కడి ప్రధాన మతకేంద్రమైన పదనయర్కులంగర గుడి లో శివుణ్ణి, కృష్ణుణ్ణి ఇద్దరినీ కొలుస్తారు. ఓచిర గుడి, వలియకులంగార దేవి గుడి కూడా దీనికి దగ్గర్లోనే ఉంటాయి. పోర్చుగీస్ పల్లీ గా పేర్గన్న ప్రాచీన పండరతురుత్ చర్చ్, పోర్చుగీసు నావికులచే నిర్మించబడిందని భావిస్తున్నారు. వీరు సముద్రం లో తప్పిపోయినప్పుడు, తమని క్షేమంగా చేర్పించిన నేల మీద చర్చ్ కట్టిస్తామని ప్రార్థించినపుడు, వాళ్ళ ఓడ కరునాగప్పల్లి చేరడం తో ఇక్కడ పండరతురుత్ చర్చ్ నిర్మించారు.