కొప్పల్ పట్టణం హీరేహళ్ళి నది ఒడ్డున ఉన్నది. కొప్పల్ జిల్లాలో మైదానాలకు షుమారు 400 మీ. ల ఎత్తున ఉన్న కొప్పల్ కోట చారిత్రక ప్రాధాన్యత, ఆకర్షణలు కలిగి ఉంది. ఈ కోటను టిప్పు సుల్తాన్ 1786 సంవత్సరంలో మరాఠా వీరులనుండి వశం చేసుకున్నాడని, దానిని ఫ్రెంచి దేశపు ఇంజనీర్ల సహకారంతో తిరిగి పునర్నించాడని చరిత్ర చెపుతోంది. బలమైన ఈ కోట నిర్మాణాన్ని బ్రిటీష్ పాలకులు కూడా ప్రశంసించారు. తర్వాతి కాలంలో బ్రిటీష్ పాలకులు నిజాం సహాయంతో దీనిని 1790 లో వశపరచుకొన్నారు. కొప్పల్ చేరాలంటే, రోడ్డు మరియు రైలు మార్గాలు కలవు. కొప్పల్ గుంటకల్ మరియు హుబ్లీ రైలు మార్గంలో ఉంది. బెంగుళూరు, విజయవాడ, బెల్గాం నుండి కొప్పల్ కు రైళ్ళు కలవు. బెంగుళూరు, హైదరాబాద్, హుబ్లీ, గోవా మైసూర్ వంటి ప్రధాన పట్టణాలనుండి బస్సులు కూడా నేరుగా ఉన్నాయి. కొప్పల్ లో ఇట్టగి లోని మహదేవ దేవాలయం, మునీరా బాద్ లోని హులిగెమ్మ దేవాలయం, కూకనూరు లోని మల్లికార్జున దేవాలయం కూడా ఎంతో ప్రసిద్ధమైనవి.