కొప్పల్ పట్టణంలో మునీరాబాద్ చిన్న గ్రామం. ప్రశాంతంగా ఉండి చక్కటి పచ్చదనం కలిగి నీలాకాశంతో ఉంటుంది. తుంగభద్ర నదికి దగ్గరలో ఉంటుంది. మునీరాబాద్ స్ధానిక ఆకర్షణలు అంటే, తుంగభద్ర డ్యామ్, పంపా సరోవర్, వాలి కొండ, హులిగెమ్మ మఠం, మరియు రిష్యమూక కొండలు అని చెప్పాలి. రిష్యమూక కొండలు - రామాయణంలో ఈ ప్రదేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాలి కొండ అనేది వాలి కోట అని చెపుతారు. రామాయణం మేరకు శ్రీరాముడు హనుమంతుడిని మొదటి సారిగా రిష్యమూక కొండపై కలిశాడు. పంపా సరోవరం వద్ద శబరి సహాయంతో సీతాదేవిని కనుగొన్నాడు. మునీరాబాద్ ఎలా చేరాలి? మునీరాబాద్ చేరాలంటే, హోస్పేట జంక్షన్ సమీప రైలు స్టేషన్ అవుతుంది. హంపి నుండి కూడా రైలులో చేరవచ్చు. రైలు స్టేషన్ నుండి స్ధానిక ఆటో రిక్షాలు, బస్సులు లభ్యం అవుతాయి. రోడ్డు ప్రయాణం తేలిక. హోస్పేట్ మరియు కొప్పల్ ల నుండి మునీరాబాద్ కు రోడ్డు మార్గాలున్నాయి.