దర్రా వన్యప్రాణి అభయారణ్యాన్ని 1955లో స్థాపించారు. గతంలో అనేక ఖడ్గమృగాలు, జింకలు, పులులు ఉండటం వలన వేటాడటానికి కోట రాజులకు ఇది ఎంతో ఇష్టమైన ప్రాంతం. ప్రస్తుతం ఈ అభయారణ్యంలో జింక, ఎలుగుబంటి, తోడేళ్ళు, లేడి,చిరుతపులులు, నిల్గై వంటి విభిన్న జాతులకు చెందిన జంతువులు కలవు. తోడేళ్ళు, లేళ్ళు పెద్ద సంఖ్యలో కనబడతాయి.