రంగస్వామి పిల్లర్ మరియు పీక్ అనే ఈ కట్టడం సముద్ర మట్టానికి 1794 మీటర్ల ఎత్తున కలదు. ఈ ప్రదేశం కోటగిరి కి 24 కి.మీ.ల దూరంలో కలదు. నీలగిరి లో నివసించే వారికి రంగస్వామి శిఖరం ఎంతో ప్రధానమైనది. స్థానికులకు ఇది వారి స్థానిక దేవతగా లెక్కిస్తారు. ఇది వారికి ఒక ప్రధాన తీర్థ యాత్ర.
ఇతిహాసాల మేరకు ఈ దేముడు శ్రీ రంగస్వామి ఒకప్పుడు కోయంబత్తూర్ లోని కరమడాయి ప్రదేశంలో నివసించే వాడు. ఆయన తన భార్య తో పోట్లాడి ఈ శిఖరం కు ఒంటరిగా నివసించేందుకు వలస వెళ్ళాడు. శిఖరం పాద భాగాన కల పాద ముద్రలు ఈ గాధ కు నిదర్సనంగా నిలుస్తాయి. పిల్లర్ శిఖరానికి వాయువ్యంగా 400 అడుగుల ఎత్తులో కలదు. ఈ కట్టడానికి ఎక్కడం చాలా అసాధ్యంగా వుంటుంది.