1955 లో ప్రారంభించబడిన వ్యవసాయ కళాశాల వెల్లాయని లో వుంది. ఈ విద్యా కేంద్రం వ్యవసాయం లోని వివిధ విభాగాల్లో స్నాతక, స్నాతకోత్తర విద్యను అందిస్తోంది.ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఒకప్పటి ట్రావెన్కోర్ – కోచిన్ రాష్ట్ర రాజ కుటుంబాల ప్రాసాదంగా వున్న భవంతిలో వుంది. ఇప్పుడు, ఈ వ్యవసాయ కళాశాల దేశంలోని ప్రఖ్యాత వ్యవసాయ సంస్థలతో సమాన౦గా వుంది. ఈ కళాశాలలో పరిశోధన చేసే విద్యార్ధులకు అత్యుత్తమ సౌకర్యాలు అందుబాటులో వున్నాయి. విద్యార్ధులు తాము ఎంచుకున్న రంగంలో తమకు తాము మెరుగులు దిద్దుకునేందుకు వారికి అన్ని విధాలా సహాయ పడుతోంది ఈ సంస్థ. సిద్ధాంతాల జ్ఞానం తో పాటు విద్యార్ధులను దేశంలోని కృషి భవన్ లకు అనుబంధం చేసి వ్యవహారపరమైన విజ్ఞానాన్ని కూడా అందిస్తోంది. నిజానికి, వ్యవసాయంలో ఉన్నత విద్య అభ్యసి౦చాలనుకునే విద్యార్ధులకు ఈ విద్యా సంస్థ ప్రయత్నాల వల్లే దేశ వ్యాప్తంగా దక్షిణాది ప్రధాన గమ్యం అయింది.