మహారాణి సేతు లక్ష్మి బాయి పుణ్యమా అని ఈ హాల్సియన్ కాజిల్ ఏర్పడింది, దీన్ని ఆవిడ భర్త మహారాజ శ్రీ రామ వర్మ వాలియ కోయిల్ తంపురాన్ నిర్మించారు. 1932లో నిర్మించిన ఈ ప్రాసాదం వైభవానికి, విలాసానికి, అద్భుతానికి తార్కాణంగా నిలించింది. ఇది ఒకప్పటి ట్రావెన్కోర్ సంస్థానంలో వుండేది. ఈ ప్రాసాదాన్ని ప్రధానంగా రాజ కుటుంబానికి ఒక తీర విహార కేంద్రంగా నిర్మించారు.1964లో రాజ కుటుంబం కేరళ ప్రభుత్వానికి దీన్ని అమ్మివేయడంతో ఇది చేతులు మారింది. ఇప్పుడు ఈ కోట ఈ ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన విలాసవంతమైన హోటల్ గా మారిపోయింది. కోవలం ప్రాసాదం గా పిలువబడే ఈ భవంతి ఇప్పుడు కోవలం లోని అంతర్జాతీయ తీర విహార కేంద్రం ఆవరణలో వుంది. లీలా గ్రూప్ హోటల్స్ వారు దీన్ని ఇప్పుడు 5 తారల హోటల్ గా నిర్వహిస్తున్నారు.