సముద్రపు అలల నుంచి విద్యుత్ తయారు చేసే కేంద్రానికి ఈ విజింజం చేపల రేవు బాగా ప్రసిద్ది. స్థానిక విద్యుత్ గ్రిడ్ ఈ విద్యుచ్చక్తి ని ఉపయోగించుకుంటుంది. దేశంలో డోలాయమానంగా వున్న నీటి వరుస నుంచి విద్యుత్ తీసే ఏకైక ప్లాంట్ ఇది.ఈ కేంద్రాన్ని డిసెంబర్ 1990 లో స్థాపించారు, అప్పటినుంచి రెండు విద్యుదుత్పాదన ప్రమాణాలను విజయవంతంగా పరీక్షించింది. ఇవాళ ఈ కేంద్ర౦ పౌర నిర్మాణాలకు కావలసిన దాంట్లో 80 శాతం అలల శక్తిని అందిస్తోంది. ఈ కేంద్రం పనితీరు మెరుగుపరచడానికి ఇప్పటికీ అధ్యయనాలు, ప్రయోగాలు జరుగుతూనే వున్నాయి. మీరు ఈ ప్రాంతంలో వుంటే తప్పకుండా ఈ చేపల రేవును, విధ్యుత్ కేంద్రాన్ని తప్పక చూసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకోండి. అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు ఈ కేంద్రం పనితీరును మీకు విశదపరచి, అది స్థానికుల జీవితాలను ఎలా మెరుగు పరిచిందో వివరిస్తారు.