తమిళ్ నాడు లోని మల్లచంద్రం సర్వే ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధ దోల్మేన్లు వందకు పైగా కలవు. దోల్మేన్ లు సాధారణంగా ఒక పెద్ద కేప్ స్టోన్ తో దాని కింద మూడు లేదా అధిక స్టోన్ పిల్లర్లు ఆధారంగా కలిగి వుంటాయి. ఈ కట్టడాలు నిర్మాణం ప్రపంచం లో ఒక చోటి నుండి మరొక చోటికి మారుతూ వుంటుంది.
మల్లచంద్రం లో దోల్మేన్ లు గుంపులుగా కలవు. బహుశా ఇవి పాతి పెట్టిన కుటుంబాలవి అయి ఉండవచ్చు. దోల్మేన్ ల తో పాటు పురావస్తు శాస్త్రజ్ఞులు మల్లచంద్రం లో స్టోన్ పెయింటింగ్ లు, కిరన్ సర్కిల్స్ వంటివికూడా కనుగొన్నారు. ఇవన్నీ మరణించిన తర్వాత ఉపయోగించే నిర్మాణాలే. ఈ విధంగా చరిత్ర కారులకు ఈ ప్రాంతం ఆసక్తికర స్వర్గం లా వుంటుంది. ఈ ప్రాంతం పురాతన చరిత్రలను ఆధునిక కాలంతో ముడి వేస్తోంది.