కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళినప్పుడు వేదవ్యాస సంపుట నరసింహ దేవాలయం కూడా చూసి రావాలి. వేదాంతం లోని ద్వైత సిద్ధాంత ప్రతిష్టాపకుడు శ్రీమద్ మధ్వాచార్యుల వారు సుబ్రహ్మణ్య దేవాలయానికి ఆగ్నేయం లో ఈ గుడి ని నిర్మించారు. కడగాల్సి వచ్చినప్పుడు తప్ప పెట్టె లోంచి తీయని నరసింహ స్వామి సాలిగ్రామాన్ని భక్తులు ఇక్కడ పూజించుకుంటారు.
పురాణ గాధను అనుసరించి ఇక్కడి లక్ష్మీ నరసింహ స్వామి, వేదవ్యాసుడి విగ్రహాలు స్వయంగా వేదవ్యాసుల వారే మధ్వాచార్యుల వారికి ఇచ్చారు. వైశాఖ మాసం లో జరిగే నరసింహ జయంతి పర్వ దినాలు మూడు రోజుల్లో యాత్రికులు లెక్కకు మిక్కిలిగా వస్తారు. మత ప్రాముఖ్యం వున్న ఈ దేవాలయాన్ని సుబ్రహ్మణ్య మఠం స్వామియార్లు నిర్వహిస్తారు.