కులు లోని ప్రసిద్ధ సాహస క్రీడలలో ట్రెక్కింగ్ ఒకటి. ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ట్రెక్కింగ్ కేంద్రం. ఇక్కడ ఎన్నో ప్రసిద్ధ మార్గాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రోతాంగ్ పాస్ కి వెళ్ళే దారిలో జన్సకర్, లడఖ్, లహాల్, స్పితి లోయలలో ఎక్కువ మార్గాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పిన్-పాస్ నుండి స్పితి లోయ, మనికరణ్ నుండి చోటా ధారా వరకు 10-12 రోజుల యాత్ర నిర్వహిస్తారు.
సాధారణంగా ఇక్కడ దూర ప్రాంతాల గుండా రెండు మూడు వారాల వరకు సాగే ట్రేక్కులను నిర్వహిస్తారు. పర్వతారోహకులు దారిలోని అనేక పురాతన ఆలయాల మీదుగా వెళతారు. ఇక్కడ పర్వతారోహణకు ఏప్రిల్ నుండి జూన్ మధ్య వరకు, సెప్టెంబర్ మధ్య, అక్టోబర్ మధ్య సమయం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు.