1960 సంవత్సరంలో నిర్మించిన మీటా రీటా సాహిబ్, సిక్కుల యాత్రాస్థలం. స్థల పురాణం ప్రకారం, గోరఖ్ పంతి జోగీలను గురు నానక్ మతపరమైన మరియు ఆధ్యాత్మిక చర్చ కోసం ఈ ప్రదేశంలోనే సందర్శించారు. రతియా నది మరియు లోధియా నది సంగమం వద్ద ఉన్నఈ స్థలం, తియ్యని రీటా అని పిలువబడే సపిందుస్ ఏమర్గినటుస్ చెట్లకు పేరు గాంచింది. దేరనాథ్ ఆలయం కూడా మీటా రీటా సాహిబ్ దగ్గరలోనే ఉంది. బైసాఖీ పూర్ణిమ సందర్భంగా, ఆలయంలో ఒక భారీ ఉత్సవం నిర్వహించబడుతుంది. ఈ ఆలయం లోహఘాట్-దేవిధుర రహదారి మీద ఉన్న ధునాఘాట్ కు అందుబాటులో ఉంది.