నానక్ మట్ట దేవోహ నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రక పట్టణం. ఈ ప్రదేశం గురుద్వారా నానక్ మాతా సాహిబ్ అనే పేరు గల గురుద్వారా ఉండటం వల్ల సిక్కులకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉంది. స్థల పురాణం ప్రకారం, సిక్కుల ప్రథమ గురువు, గురు నానక్ దేవ్ క్రీ.శ. 1515 లో కైలాష్ పర్వతం వెళ్ళే మార్గంలో, ఈ స్థలం సందర్శించారు. గురుద్వారా సరయు నది మీద నిర్మించబడింది. నానక్ సాగర్ ఆనకట్ట సమీపంలోనే ఉంది. పర్యాటకులు ఇక్కడ విహారం మరియు చేపల వేట, పడవ షికార్లు వంటి వివిధ చర్యలు అనుభవించవచ్చు. వారికి పర్యాటక విశ్రాంతి గృహం మరియు గురుద్వారా లో బస సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.