కొట్టాయం నుండి 12 కిలో మీటర్ల దూరం లో , కుమరకోమ్ కి దగ్గరలో ఉన్న క్రైస్థవ భక్తి కేంద్రాలలో సెయింట్ మేరీ చర్చి అతి ముఖ్యమినది.1579 లో నిర్మితమైన ఈ చర్చి అనేక శతాబ్దాల చరిత కలిగినది.మలంకర ఆర్థోడాక్స్ క్రైస్థవుల ముఖ్య ఆధ్యాత్మిక ప్రదేశము.క్రైస్థవ వర్గాలయిన కననాయ మరియు వాడక్కుం భగర్ మధ్య కలిగిన విభేదాలను పరిష్కరించటానికి చూపబడిన మార్గమే ఈ చర్చి యొక్క నిర్మాణం.తేక్కుమ్కుర్ మహారాజు వాడక్కుం భగర్ వారికి మరొక ప్రదేశం లో చర్చి నిర్మించటానికి స్థలాన్ని కేటాయించి , తన నిర్వహణలో చర్చి ని నిర్మింప చేసారు.తన అధ్బుతమైన నిర్మాణ శైలి తో కళాభిమానుల ను,పర్యాటకులని ఈ చర్చి ఆకర్షిస్తుంది. ఈ చర్చి కేరళ మరియు పొర్చుగీసు శైలిని నిర్మాణ మరియు రూపాలలో ప్రతిబింబిస్తుంది. క్రైస్థవ మరియు క్రైస్థవేతర నేపథ్యాలలో ఈ చర్చి యొక్క గోడలపై చిత్రాలు చిత్రింపబడి ఉంటాయి.జనవరి 15 న జరిగే వితుకలుడే పెరున్నల్ (ఫెస్టివల్ అఫ్ సీడ్స్) అనే పండుగ ఇక్కడ జరిగే ముఖ్య పండుగ.