కంప హరేస్వర్ టెంపుల్ కుంబకోణం లోని తిరుబువనం వద్ద ఒక చిన్న విలేజ్ లో కలదు. ఈ టెంపుల్ ను ప్రతి ఏటా అనేకమంది యాత్రికులు దర్శిస్తారు. టెంపుల్ నిర్మాణం 1౩ వ శతాబ్దంలో రాజు కులోత్తుంగ పాలనలో జరిగింది. తర్వాతి కాలంలో వచ్చిన చేర, చోళ, పాండ్య రాజులు దీనిని పూర్తి చేసారు. ఈ టెంపుల్ లో శివ భగవానుడి విగ్రహం వుంటుంది. టెంపుల్ ముందు భాగం సుమారు 120 అడుగుల ఎత్తులో వుండి ఒక రధం వలె ఆకర్షణీయంగా వుంటుంది.