శ్రీ విట్టల్ రుక్మిణి సంస్థాన ను 1998 లో బ్రహ్మశ్రీ విటల్ దాస్ జయకృష్ణ దీక్షితార్ స్థాపించారు. ఈ సంస్థాన్ లక్ష్యం ప్రజలలో కీర్త్తనల ద్వారా భక్తి భావం పెంపొందించడం. తద్వారా మోక్షం పొందడంగా చెపుతారు. ఈ లక్ష్యంతో శ్రీ విట్టల్ దాస్ మహారాజ్ శ్రీ విట్టల్ రుక్మిణి సంస్థాన గోవిందపురంలో స్థాపించారు. ఈ ప్రదేశం కుంబకోణం నుండి ఆరు కి.మీ.ల దూరంలో కుంబకోణం అడుతురాయి హై వే పై వుంటుంది. ఈ ప్రాంతంలో నేటికీ అక్కడ సమాధి వద్ద జాగ్రత్తగా వింటే రామ నామ సంకీర్తనం వినపడుతుందని చెపుతారు.