ఉప్పిలి అప్పన్ టెంపుల్ శ్రీ మహా విష్ణువు దేవాలయం. దీనిలో విష్ణుమూర్తి ఆయన సహచరిణి భూదేవి విగ్రహాలు వుంటాయి. మహర్షి మార్కండేయ విగ్రహం కూడా వుంటుంది. ఈ టెంపుల్ ను 108 దివ్య దేశం లలో ఒకటిగా చెపుతారు. ఈ టెంపుల్ తంజావూర్ లోని తిరున్గేస్వరం విలేజ్ లో కలదు. కుంబకోణం నుండి 7 కి.మీ.ల దూరం వుంటుంది. రోడ్ మార్గంలో తేలికగా చేరవచ్చు. యాత్రికులు దీనిని దక్షిణ తిరుపతి అంటారు.
ఈ టెంపుల్ లో ఉప్పు లేని ఆహారాలు మాత్రమే నైవేద్యం పెడతారు. ఉప్పు వేసి ఆహరం చేస్తే దేముడు కోపిస్తాడని చెపుతారు. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవం మరియు కల్యాణం జరుగుతాయి.