కుంభాల్ ఘర్ ఫోర్ట్ 15 వ శతాబ్దంలో రాజు రానా కుంభాచే నిర్మించారు. ఈ మేవార్ కోట బాణా నది ఒడ్డున ఉంది. ఇది రాజస్థాన్ లోని రెండవ అతి ముఖ్యమైన కోట. పెద్ద సంఖ్యలో పర్యాటకులుకోట కువస్తారు. ఈ భారీ కోట 13 శిఖరాలను, వాచ్ టవర్లను, మరియు బురుజులను చుట్టూ కలిగి ఉంది.
కుంభాల్ ఘర్ కోట ఆరావళి ప్రాంతంలో సుమారుగా 36 కి.మీ. ల మేర వ్యాపించి ఉంది. దీనిలోమహారాణా ఫతే సింగ్ నిర్మించిన గోపుర ప్యాలెస్ ఉన్నాయి. పొడవైన ఈ గోడ శత్రువుల దాడుల నుండి రక్షణ కోసం నిర్మించారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తర్వాత ఇది రెండోపొడవైన గోడగా ఉంది.
కోటకు ఏడు భారీ ద్వారాలు కలవు. వీటిలో రామ్ పాల్ అతిపెద్ద గేటుగా ఉంది. పర్యాటకులు హనుమాన్ పాల్, మీద ఒక గుడిని చూడగలరు. హుల్లా పాల్, రామ్ పాల్, పగ్రాపాల్, నింబూపాల్, భైరవ పాల్ మరియు ఖానా పాల్ లు కోటకు గల ఇతర గేట్ల పేర్లు.పర్యాటకులు కోట నుంచి పరిసర ప్రాంతాల ను చక్కగా దర్శించవచ్చు. కర్తార్ ఘర్ అని పిలిచే మరొక కోట కూడా కుంభాల్ ఘర్ ప్రధాన కోట లోపల కలదు.