జగన్నాధ గట్టు ఆలయం, కర్నూలులో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. శివునికి ప్రసిద్ది చెందిన ఈ ఆలయం కర్నూలు లోని బి.తాండ్రపాడు లో ఉంది. ఈ లింగానికి ఉన్న చరిత్రవల్ల ఈ ప్రాంతం ప్రాముఖ్యత పొందింది. ఈ ఆలయంలోని శివలింగాన్ని పాండవ రాజైన భీముడు తీసుకువచ్చాడని పురాణాల కధనం. ఈ శివలింగాన్ని గ్రానైట్ రాయితో చేశారు. ఈ శివలింగం ఎత్తు 6 అడుగులు, వెడల్పు 2 అడుగులు.