సోమేశ్వర దేవాలయంలో హిందువుల దైవం శివలింగం ఉంటుంది. ఎంతో మహిమాన్విత లింగంగా భక్తులు దీనిని ఆరాధిస్తారు. ఈ దేవాలయ ఆవరణలో ఇంకా చిన్న గుళ్ళ శిధిలాలు కనపడుతూంటాయి. రికార్డులమేరకు ఈ దేవాలయం చోళ రాజుల కాలంలో నిర్మించబడింది. దేవాలయం పై చెక్కడాలు చరిత్ర ప్రసిద్ధి గాంచిన తండ్రి కుమారులైన జక్కనాచారి అతని కుమారుడు డంకనాచారి నిర్వహించారు. అన్నిటికంటే విశేషమైన అంశం ఏమంటే, ఈ దేవాలయం పూర్తిగా రాళ్ళతోనే చెక్కబడింది. దీనికి పునాదులు లేవు.