ఈ ఆలయం పాండవులకు దగ్గరి సంబంధాన్ని కలిగిఉంది. ఈ ఆలయం ఉత్తర థానేశ్వర్ లో ఉంది. పురాణాల ప్రకార౦, పాండవులు కౌరవులతో తుది సమరానికి ముందు ఇక్కడ తపస్సు ఆచరించారు. కాళీదేవి కోసం నిర్మించిన భద్రకాళీ ఆలయం ఆవిడ వివిధ అవతారాలను చూపిస్తుంది. శక్తి పీఠాలలో ఒకటిగా భావించే ఈ దేవాలయంలో సతీదేవి కాలి కిందిభాగం పడిందని భావిస్తారు.
హిందూ విశ్వాసాల ప్రకారం, శక్తి పీఠాలలో కోరికలు ఫలిస్తాయి. ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు అమ్మవారికి మట్టి గుర్రం ప్రతిమను భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. ఎర్రటి ఇసుకరాతితో నిర్మించిన ఈ ఆలయం నవరాత్రి ఉత్సవాల సమయంలో ధగధగ మెరిసిపోతుంది.