మహాభారత కాలానికి, అంతకన్నా ముందరి కాలానికి మూలాలు వున్న కురుక్షేత్ర హిందువులకు చాలా ముఖ్యమైన తీర్థ యాత్రా కేంద్రం. అయితే ఇప్పుడిది పండితులను, గురువులను, వివిధ మతాలు, విశ్వాసాలకు చెందిన యోగులను, వేదాంతులను ఆకర్షిస్తోంది.
బుద్ధుడు కూడా ఇక్కడికి వచ్చాడని, ఆయన రాకకు జ్ఞాపకంగా కొన్ని నిర్మాణాలు జరిగాయని అంటారు. వీటిలో కొన్ని తరువాతి కాలంలో నిర్మించారు. కనుక కురుక్షేత్ర బౌద్ధులకు కూడా ముఖ్యమైన యాత్రా స్థలం కావడంలో ఆశ్చర్యం లేదు.