సూర్య గ్రహణం సందర్భంగా ఈ ప్రాంతాన్ని తన కుటుంబంతో సహా సందర్శించిన శ్రీ గురు అమరదాస్ జ్ఞాపకార్ధం ఈ గురుద్వారా నిర్మించారు. అప్పట్లో హిందూ దేవాలయాలకు వెళ్తే పన్ను కట్టాల్సి వచ్చేది. గురువు గారు కట్టడానికి నిరాకరించారు, అయినా అతని తీర్థ యాత్ర కొనసాగించడానికి చక్రవర్తి అనుమతి ఇచ్చాడు.
సిక్కుల ప్రార్ధనా స్థలం అయిన గురుద్వారా కు ఏడాది పొడవునా అసంఖ్యాకంగా భక్తులు వస్తారు. గురు పూరబ్స్ లేదా సిక్కు గురువుల జన్మదినోత్సవాలను చాలా వేడుకగా జరుపుకుంటారు.