శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన దివ్య స్థలం అయిన జ్యోతిసర్ బహుశా ప్రపంచంలోనే హిందువులకు అత్యంత ముఖ్యమైన తీర్థ క్షేత్రం. యుద్ధ౦ మొదలు పెట్టడానికి శంఖాలు ఇక్కడే పూరించారు.
క్రీస్తు శకం 9 వ శతాబ్దంలో తన భారత దేశ యాత్రలో భాగంగా ఇక్కడికి చేరుకున్న ఆది శంకరాచార్యులు తొలి సారిగా ఈ ప్రాంతం ప్రాముఖ్యాన్ని గుర్తించారు. దీని ధార్మిక ప్రాముఖ్యాన్ని పురస్కరించుకుని కాశ్మీర్ రాజు 1850 లోలో ఇక్కడ ఒక శివాలయం నిర్మించాడు.
గీత పుట్టుకకు గుర్తుగా నిలిచిన మర్రి చెట్టు చుట్టూ దర్భంగా రాజు ఒక రాతి వేదిక నిర్మించాడు.
గుర్రాలు ఉంచిన రథం మీద శ్రీ కృష్ణుడు తూర్పుకు అభిముఖంగా నిలబడి గీత భోదిస్తుండగా క్రింద నేల మీద ముకుళిత హస్తాలతో శ్రద్ధగా ఆలకిస్తున్న అర్జునుడి విగ్రహాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్యులు 1967 లో జ్యోతిసర్ లో నిర్మించారు.
జ్యోతిసర్ లో ఆంగ్ల, హిందీ భాషల్లో ఒక శబ్ద కాంటి ప్రదర్శన ప్రతి సాయంత్రం నిర్వహిస్తారు.