హర్యానా ప్రభుత్వం కురుక్షేత్ర ప్రాంతంలో వివిధ యాత్రిక, పర్యాటక కేంద్రాల ప్రాముఖ్యతను ఉద్దీపనం చేయడానికి శ్రీ కృష్ణ మ్యూజియం, జ్యోతిసర్, కృష్ణుడు బోధించిన అమరత్వ గీతా జ్ఞాన నీటిబుడగ కేంద్రం వంటి అనేక కాంతి, శబ్ద కార్యక్రమాలు ప్రారంభించింది. ఆదిశంకరాచార్యులవారు ధ్యానం, తపస్సు కొస౦ హిమాలయాలకు వెళుతున్నపుడు ప్రయాణ సమయంలో ఈ ప్రదేశాన్ని గుర్తి౦చడం జరిగిందని నమ్మకం.
ఈ ప్రదర్శనను జ్యోతిసర్ లోని ప్రధాన యాత్ర స్థలం వద్ద ప్రతి సాయంత్రం నిర్వహిస్తారు, ప్రపంచ ప్రసిద్ది చెందిన గుర్రాలతో నడుపబడుతున్న రధ శిల్పం కూడా ఇక్కడ ఉంది, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో నిలబడి, గీతోపదేశం చేస్తున్నపుడు, అర్జునుడు చేతులు ముడుచుకుని, తలకాయ వంచి క్రింద కూర్చుని, ఏకాగ్రతతో భయంతో ఉపదేశాన్ని వింటున్నాడు.
భగవద్గీత చిహ్నానికి 1967 వ సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్యులవారు, ఏర్పరచిన వేదిక మీద మచ్చుతునకగా ఉన్న శిల్పాన్ని నిర్మించారు. కాంతి, శబ్ద ప్రదర్సన మహాభారత పురాణంలోని సంఘటనల సరళిని వర్ణిస్తాయి. శ్రీకృష్ణుని పాత్రలు, బోధనలు హిందీ, ఇంగ్లీష్ రెండు భాషలలో అందించ బడతాయి.