ఈ చైనీస్ ఆలయం, దీనిని లిన్ సన్ చైనీస్ ఆలయం అని కూడా పిలుస్తారు. కుషీనగర్ లో ఉన్న నవీన ఆలయాలలో ఇది ఒకటి. ఈ నగరంలోకి అడుగు పెట్టగానే పర్యాటకులను మొట్టమొదటిగా ఈ బౌద్ధ స్మారకస్థూపం ఆకర్షిస్తున్నది.
దీనిని చైనీస్ మరియు వియత్నామీస్ నిర్మాణాత్మక నమూనాల మిశ్రమంతో నిర్మించారు. ఈ ఆలయ ఆకృతి వివిధ రంగులతో ప్రత్యేకంగా మరియు నగరంలో ఉన్న ఇతర బౌద్ధ పీఠాలు మరియు స్మారకాలనుండి అత్యద్భుతమైన వైవిధ్యం కలిగి ఉన్నది. దేవాలయంలోని బుద్దుడి విగ్రహం కూడా చైనీస్ శైలిలో నిర్మింపబడింది. యాత్రికులకు మరియు పర్యాటకులకు ఈ బుద్దుడి విగ్రహం గొప్ప ఆకర్షణ.
ప్రధాన ఆలయం కాకుండా బుద్ధ విగ్రహం, ఉత్తర భారతదేశం యొక్క నగరాల్లో ఉన్న, రాజగిర్ మరియు బీహార్ లోని భొధ్ గయ, నేపాల్ లోని లుంబిని, ఉత్తర ప్రదేశ్ లోని శరావతి, నిర్వాణ దేవాలయం మరియు కుషీనగర్ లోని స్థూపం వంటి ముఖ్యమైన బౌద్ధ దేవాలయాల నమూనాలు ఇక్కడ ఉన్నాయి.
ఇది వియత్నాం,ఌన్హ్-సన్ బౌద్ధులచే నిర్వహించబడుతోంది. ఈ ఆలయ సముదాయంలో ధ్యానం హాల్, ధర్మ హాల్, విహార్ మరియు ఒక పాఠశాల ఉన్నాయి.