ఇది కాసియా-తామ్కుహి రోడ్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో నది ఒడ్డున ఉన్నది. కురుకుళ్ళ ఆస్థాన్ మొట్టమొదటి శక్తి స్వరూపిణి, ఆది శక్తి అయిన కురుకుళ్ళ దేవికి అంకితం చేయబడింది. ఈ పవిత్రమైన స్థలాన్ని నాగార్జునుడు కట్టించాడని నమ్ముతారు.
ఇది అందమైన మరియు అత్యద్భుతమైన పరిసరాలు ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్నది. ఇక్కడికి ప్రజలు తమ దైనందిన సంక్షోభాల నుండి విశ్రాంతి మరియు శాంతిని పొందటానికి మరియు ధ్యానం చేసుకోవటానికి వొస్తుంటారు. ఈ ప్రాంతం ప్రజలకు ఒక ధ్యానకేంద్రంగా ఉంటున్నది కనుక ఇది చాలా ప్రాచుర్యంలోకి వొచ్చింది.