వాట్ థాయ్ కుషినరా చలేర్మరాజ్ దేవాలయాన్ని క్లుప్తంగా కేవలం 'వాట్ థాయ్ దేవాలయం' అని పిలుస్తారు. కింగ్ భూమిబోల్ అదుల్యదేజ్ రాజ్య సింహాసనాన్ని అధిష్థాన స్వర్ణోత్సవ వేడుకలిని జరుపుతారు. ఈ దేవాలయాన్ని థాయిలాండ్ నుండి బుద్ధ శిష్యులు నిర్మించారు.
ఈ ఆలయ నిర్మాణాన్ని సోమదేజ్ ఫ్రా యన్సంగ్వర, థాయిలాండ్ రాజ్యాధిపతి పాత్రిఅచ్ 21 ఫిబ్రవరి, 1999 న ప్రారంభించారు. దీనిని 2001 లో పూర్తీ చేసి, ప్రజలకొరకు తెరచి ఉంచారు. దీని నిర్మాణానికి ముఖ్యంగా తాహి బుద్ధులు ఇచ్చిన విరాళాలను వెచ్చించారు.
ఈ ఆలయాన్నిమొట్టమొదటి అడవిలో ఉన్న ఆశ్రమంగా భావిస్తారు మరియు కాబట్టి, ఇది, దట్టమైన వివిధ రకాల చెట్లు, పొదలు మరియు మొక్కలు ఉన్న అడవిలో ఉన్నది.
థాయ్-బౌద్ధ నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయము, పది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఒక పెద్ద కాంప్లెక్స్ లో ఉన్నది. ఆలయంతో పాటు, కాంప్లెక్స్ లో ఒక ఆశ్రమం, తోట, ఆరోగ్య కేంద్రం, పాఠశాల మరియు గ్రంధాలయం ఉన్నాయి.
కుషీనగర్ లో ఉన్న అందమైన పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి మరియు దీనిని ప్రతి సంవత్సరం వేలకొద్ది యాత్రికులు థాయిలాండ్ నుండి సందర్శించటానికి వొస్తారు. దీని పెద్ద ఆకృతిని నగరంలోని అన్ని వైపులనుండి చూడవొచ్చు.