సేనాధిపతి జోరావర్ కోట, లేహ్ రాజభవనం మరియు నామ్గ్యాల్ త్సేమో గొంప పైన ఉంది. ఈ చరిత్రపూర్వ స్మారక ప్రదేశం రియాసి కోటగా కూడా పిలవబడుతుంది. ప్రస్తుతం శిధిల దశలో ఉన్న ఈ కోట, ఒకప్పుడు జమ్మూలో దోగ్రా పాలకుల సంపదకు నెలవయ్యింది.
లడఖ్ కోసం చైనీస్ పాలకులకు వ్యతిరేకంగా స్థిర పోరాటం చేసిన సేనాధిపతి జోరావర్ సింగ్ అనే ప్రసిద్ద యోధుని స్వంతం ఈ కోట. ఆ పాలకుని విలువైన నిధితో పాటు నాణేలు మరియు కొత్త ముద్రల నమూనాల భారీ సేకరణ ఇప్పుడు ఈ కోట లో ఉంది. చీనాబ్ నది చేరువలోలో ఉన్న ఈ కోట, పురావస్తు శాస్త్రం, చరిత్ర పూర్వ సంస్కృతి, మరియు వస్తువల పట్ల ఆసక్తి ఉన్న వారిని ఆకర్షిస్తుంది. కోట లోపల ఒక మసీదు, ఒక సహజ సిద్ధ నీటి చలమ, మరియు హిందూ మత దేవత అయిన కాళీ మరియు దుర్గా ఆలయం ఉంటాయి.
ఈ స్థలం చేరటానికి ప్రయాణికులు తమ వాహనాలను కోట ప్రవేశ ద్వారం దాకా నడిపించవచ్చు లేక కోటకి కొద్ది దూరంలోనే ఉన్న లెహ్ నగర బజారు నుంచి కాలి నడకన కూడా చేరుకోవచ్చు.