శంకర్ ఆరామం అని కూడా పిలవబడే శంకర్ గొంప, లేహ్ నుండి 3 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడికి సులభంగా నడుస్తూ కూడా చేరుకోవచ్చు. 'బోధిసత్వ' లేదా జ్ఞానోదయం ప్రాప్తించి అందరి బుద్దులు యొక్క దయ మూర్తీభవించిన అవలోకితేశ్వర విగ్రహం ఈ గొంప లో ఉంది. ఈ ప్రతిమకి పదకొండు తలలు, వేయి చేతులు మరియు ప్రతి అరచేతి పై కళ్ళు ఉంటాయి. సంప్రదాయ వాస్తు శైలిలో రూపకల్పన జరిగిన 'నాలుగు దిశల రక్షకులు' చిత్రాలు ప్రవేశద్వారం వద్ద ఉంచబడ్డాయి.
అక్కడే నివసిస్తున్న కేవలం 20 సన్యాసులు ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి, ఆరామం యొక్క సందర్శన సమయం ప్రాతః సమయం మరియు సాయంత్రం వేళ కే పరిమితం. ఈ ఆరామంలో డు-ఖాంగ్ అనే సభా మందిరం ఉంది. దీన్నిఒక మెట్ల మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ మార్గం నేరుగా మందిరంకి ఉండే రెండు తలుపులకు దారితీస్తుంది. ఈ ప్రదేశం యొక్క గోడలు మరియు తలుపులు పై మండలాలు, సన్యాసులు నియమాలు మరియు టిబెటన్ క్యాలెండర్లు చిత్రించబడ్డాయి. చరిత్రానుసారం, ఈ ఆరామం గతంలో స్పితుక్ సన్యాసి నివాసంగా ఉండేది. ఇప్పటికీ మేడమీద ఉన్న అతిథిగృహాలు మరియు గ్రంథాలయంతో పాటు వీరి గదులను కూడా చూడవచ్చు.