వీరభద్ర టెంపుల్, అనంతపురం నుండి 15 కిలో మీటర్ల దూరం లో ఉన్న లేపాక్షి గ్రామంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి.
విజయనగర సామ్రాజ్యాధిపతుల చేత ఈ ఆలయం 16 వ శతాబ్దం లో నిర్మింపబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలి లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి గొప్ప ఉదాహరణ ఈ ఆలయం. ఈ ఆలయం అధ్బుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యం తో అలరారుతూ ఉంటుంది.
అటువంటి ఒక మండపం మనిషి ఎత్తు నృత్యకారులు ఇంకా సంగీత విద్వాంసుల విగ్రహాలతో తన ప్రత్యేకతను చాటుకుంటుంది. అతి పెద్ద రాతి నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఇంత అద్భుతంగా ఆలయం ప్రతి సంవత్సరం భక్తులని విశేషంగా ఆకర్షించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.