శిలా ప్రాంతంలో ఏర్పడ్డ ఏకైక ఉప్పునీటి సరస్సుగా లోనార్ ప్రసిద్ది చెందింది. లోనార్ గ్రామంలో వున్న ఈ గొయ్యి దిగ్భ్రమ పరచే 52000 ఏళ్ల క్రితం భూమిని తాకిన ఉల్కాపాతం వల్ల ఏర్పడిందని చెప్తారు.ప్రస్తుతం ఈ గొయ్యి చుట్టూ వివిధ జాతుల పక్షులతో కూడిన దట్టమైన అడవులు ఏర్పడ్డాయి. బాతులు, గుడ్లగూబలు, నెమళ్ళు, ఎన్నప్ప చితవ, లాంటి పక్షులను ఇక్కడ చూడవచ్చు. అయితే, ఈ సరస్సు ఎలాంటి వృక్ష, జల చరాల మనుగడకు అనువైనది కాదు.ఈ సరస్సు స్వతహాగా చూడాల్సిన ఆకర్షణ. సాయం సమయంలో సూర్యుడు అస్తమించే ముందు దీన్ని చూడాలి. దగ్గరలోని లోనార్ సరోవర్ చాలా ఔషధ, సుగంధ మొక్కలకు, పొదలకు నెలవు. ఇక్కడి 3 కిలోమీటర్ల దగ్గరలో కమల్జా మాత దేవాలయం కూడా వుంది.విశ్వ రహస్యాల గురించి ఆసక్తి గల యాత్రికులు, భూగర్భ శాస్త్రం లేదా సామాన్య శాస్త్రం ఇష్టమైన వాళ్ళు తప్పని సరిగా జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాన్ని సందర్శించాలి.