లోహ ఘడ్ అంటే లోహపు కోట అని అర్ధం వచ్చే ఈ కోట లోనావాలా లోని సహ్యాద్రి శ్రేణుల్లో వుంది. అది పవనా, ఇంద్రాయని పరీవాహక ప్రాంతాలను చీలుస్తుంది. 1050 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తులో వున్న ఈ కోటను ఛత్రపతి శివాజీ మహారాజు విస్తృతంగా ఉపయోగించాడు. విదర్భ, మరాఠా రాజ్యాల్లో చాలా వంశాలకు పుట్టినిల్లుగా ఇది ప్రసిద్ది పొందింది. మీకు శిల్ప కళ, చరిత్ర, పురావస్తు రంగాల్లో ఆసక్తి వుంటే, ఈ ప్రదేశాన్ని వదులుకోకండి. ఈ కోటను కాపలా కాసే నాలుగు పెద్ద ద్వారాలు ఇప్పటికీ ధృడ౦గా వుండి చక్కగా పని చేస్తున్నాయి.