భారతదేశంలోని ప్రజల కష్టాలను ఎత్తిచూపడానికి ఏర్పాటు చేసిందే ఈ 1857 మెమోరియల్ మ్యూజియం, స్వతంత్ర భారతదేశ మొదటి యుద్ధ చరిత్రలోని చిరస్మరణీయ కాలంలో లక్నో ప్రజలు కూడా పాత్రను పోషించారు. లక్నో బ్రిటీషు పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటుచేసిన ముఖ్య సంఘటనల కేంద్రంగా ప్రసిద్ది గాంచింది.
ఈ మ్యూజియం కు అనుబంధంగా నివాస భవనం, స్వతంత్ర ఉద్యమంలో గొప్ప విషయాలను అందించే ప్రదర్శనలు ఉన్నాయి. ఇంది భవన తవ్వకాలలో బయటపడ్డ కళాఖండాలు, లోడ్ చేసిన రివాల్వర్, పింగాణీ వస్తువులు, వైన్ సీసాలు, పత్రాలు, ఫోటోగ్రాఫ్ లు, చిత్రాలు, షీల్డ్ లు, రాతిచిత్రాలు, ఆయుధాలు, ఫిరంగులు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి, తుపాకులు, మస్కెట్లు, ఫిరంగులు, బాడ్జీలు, నిస్చితతను పోలిన ఇతర ముఖ్యమైన అంశాలను కలిగిఉంది. ఈ ప్రదర్శనను ఒక క్రమపధ్ధతిలో, క్రమానుగత లెక్కలతో స్వాతంత్రోద్యమ సంఘటనలు అందించే విధంగా ఏర్పాటుచేసారు. ఇక్కడ లక్నో వ్యూహాత్మక ప్రదేశాలలో చూపించే అనేక పటాలతో పాటు, భవన నమూనాలు కూడా ఉన్నాయి.
ఈ మ్యూజియ౦ కింది అంతస్తు భావన బేస్మెంట్ ప్రాంతంలో విస్తరించి ఉంది. ఇక్కడ క్రింది అంతస్తులో నాలుగు గ్యాలరీలు, నేలమాళిగలో ఏడు గాలరీలు ఉన్నాయి.