ఫిరంగి మహల్ భవనం యూరోపియన్లకు చెందినది. ఔరంగా జేబ్ కాలం లో దీనిని ఒక ఫ్రెంచ్ వర్తకుడు కట్టించాడు. అయితే, మొగలాయీ ప్రభుత్వం ఈ బిల్డింగ్ ను ఒక విదేశీయుడు కట్టించాడనే కారణంతో స్వాధీనం చేసుకొంది. ఈ భవనం లో కేం బ్రిజ్, ఆక్స్ ఫర్డ్ లకు సమానమైన విద్య సంస్థ నెలకొల్పారు. మహాత్మా గాంధి దీనిలో కొంత కాలం నివాసమున్నారు. ఫిరంగి మహల్ ఇస్లాం సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు కృషి చేసింది.