హుస్సైనాబాద్ క్లాక్ టవర్ హుస్సైనబాద్ ఇమామ్బర కు ఎదురుగా ప్రఖ్యాత రూమి దర్వాజా కు ఒక మెయిలు దూరం లో కలదు. సుమారు 221 అడుగుల ఎత్తుకల ఈ భవనం దేశం లోనే ఎత్తైనదని చెప్పవచ్చు.
1887 లో నిర్మించిన ఈ క్లాక్ టవర్ ఇండియా లో విక్టోరియా నిర్మాణ శైలి కి ఒక ఉదాహరణ. దీనిని నవాబ్ నసీరుద్దిన్ మొదలు పెట్టగా, ఆయన మరణానంతరం పూర్తి చేసారు. దీని వ్యయం ఆ రోజులలో రూ. 1.74 లక్షలు అయింది.
ఈ క్లాక్ లోని భాగాలు లండన్ నుండి తెప్పించిన గన్ మెటల్ తో తయారు చేసారు. దీని పెండ్యులం వెస్ట్ మినిస్టర్ క్లాక్ కంటే పెద్దది. గంటలు కొడుతూ ఇది ఒక పువ్వు ఆకారాపు డయల్ పై కదులుతుంది.