రామకృష్ణ మట్ , బేలూర్ లోని రామకృష్ణ మిషన్ శాఖ.దీనికి ఇక్కడ రెండు సంస్థలు కలవు. వాటిలో ఒకటి వివేకానంద పోలి క్లినిక్ కాగా రెండవది చుట్టూ పట్ల గ్రామాలలో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
ఈ పోలి క్లినిక్ ను 1970 లో మట్ ప్రెసిడెంట్ స్వామి వీరేశ్వరనంద్ ఆవిష్కరించారు. ఇక్కడ నిరాలగర్ లోని రామకృష్ణ మార్గ లో శ్రీ రామకృష్ణ టెంపుల్ కూడా కలదు. దీనిని సమీపిస్తున్న కొలది పర్యాటకులు మంత్ర ముగ్దులవుతారు.
దీని ప్రధాన గోపురం 90 అడుగుల ఎత్తులో వుంటుంది. ఈ టెంపుల్ లో శ్రీ రామకృష్ణ, శ్రీ శ్రీ మా త శారద దేవి మరియు స్వామి వివేకానందుల విగ్రహాలు వుంటాయి. ఈ టెంపుల్ లో అనేక ఇతర చిత్రాలు కమలం, త్రిశూలం, డ్రం, సంఖం, హంస, పిడుగు వంటివి కూడా వుంటాయి. వీటిని ఎర్ర సిమెంట్ తో తయారు చేసారు. మార్బుల్ మరియు రెడ్ ఇసుక రాయి తో నిర్మించిన ఈ టెంపుల్ లో జైనుల, పల్లవుల, చాలుక్యాల, మొగలుల శిల్ప కళా వైభవం చూడవచ్చు.