అరుప్పు కొట్టాయి టవున్ మదురై కి సుమారు 48 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ప్రదేశం దాని జాస్మిన్ ఉత్పత్తులకు ప్రసిద్ధి. ఇక్కడ అనేక టెంపుల్స్, మసీదులు, చర్చిలు కలవు. ఈ ప్రదేశ ప్రధాన ఆకర్షణలు అంటే నల్లిర్ ముహైదీన్ అందవార్ మసీదు, వాజవంధపురం జుమ పల్లివసాల్, శ్రీ అరుళ్మిగు సోక్కనతార్ స్వామి టెంపుల్, అరుళ్మిగు శ్రీ ముతుమారి అమ్మన్ టెంపుల్ సి ఎస్ ఐ చర్చి , రోమన్ కేథలిక్ చర్చి, వంటివి. ఇది యాత్రా స్థలం గానే కాక ఒక పారిశ్రామిక టవున్ గా కూడా ప్రసిద్ధి చెందినది. ఈ టవున్ ఇతర నగరాల తో పాటు మదురై కి అనుసంధానించా బడింది. కనుక మదురై వెళ్ళే దోవలో ఈ ప్రదేశం పర్యాటకులు చూడవచ్చు.