తిరుపర్ణ కుంద్రం మదురై నగరానికి 8 కి.మీ.ల దూరంలో మదురై జిల్లా లో కలదు. ఈ ప్రదేశంలో ఒక మురుగన్ టెంపుల్ మరియు హజరత్ సుల్తాన్ సికందర్ బాదుష షహీద్ దర్గా కలవు. దర్గా తిరుపరాన్ కుంద్రం కొండ పై వుంటుంది. మురుగన్ టెంపుల్ ను కొండలో కట్టారు. పురాతన టెంపుల్ ను 8వ శతాబ్దంలో పాండ్య రాజులు నిర్మించారు. దీనిలో శివుడు, మాత దుర్గ, లార్డ్ విష్ణు విగ్రహాలు కలవు.
ఈ టెంపుల్ ని సూర్యుడు మరియు చంద్రుడు కలసి చూసే ప్రదేశం లో నిర్మించటం విశేషం. లార్డ్ మురుగా ఈ టెంపుల్ లో వివాహం చేసుకున్నాడని కనుక ఈ టెంపుల్ వివాహాలకు ప్రసిద్ధి అని చెపుతారు.