కొన్నాట్ శిఖరం మహాబలేశ్వర్ లో రెండవ అతి పెద్ద శిఖరం. ఇది కొండలలో సుమారు 1400 మీటర్ల ఎత్తున కలదు. దీనిని మొదట్లో మౌంట్ ఒలింపియా అని పిలిచేవారు. తర్వాతి కాలంలో బ్రిటీష్ పాలనలో దీనిని డ్యూక్ ఆఫ్ కొన్నాట్ అని పిలిచారు. క్రిష్ణ లోయ మరియు వెన్న సరస్సు ప్రదేశాలు ఈ శిఖరం నుండి ఎంతో అందంగా కనపడతాయి. ఈ ప్రదేశాన్నించి అజిన్ క్యతారా, రాజ్ఘర్ మరియు కమలఘఢ్ వంటి కొన్ని ప్రదేశాలను కూడా చూడవచ్చు. తూర్పునకల పసరాణి ఘాట్ పడమటి దిశగా ప్రతాప్ ఘఢ్ కోటలను కూడా ఇక్కడినుండి చూడవచ్చు.